News October 8, 2025

ఏయూ స్నాతకోత్సవం వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడిందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 సంయుక్త స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.

Similar News

News October 8, 2025

పార్టీ మారినా ఎమ్మెల్సీ పద్మశ్రీకి దక్కని ప్రాధాన్యత!

image

కాకినాడ: ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన MLC కర్రి పద్మశ్రీని అవమానాలు వెంటాడుతున్నాయి. అందరూ ఎమ్మెల్సీలను పిలుస్తున్నా.. ఇంతవరకు ఆమెను మాత్రం జడ్పీ సర్వసభ్య సమావేశానికి పిలవలేదట. గతంలో YCPలో ఉన్నప్పుడూ ప్రాధాన్యత దక్కలేదని ఆమె అనుచరులు వాపోతున్నారు. నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీని ఎదగనివ్వలేదంటున్నారు. ఇప్పుడు TDPలో చేరగా MLA కొండబాబు సైతం పద్మశ్రీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

News October 8, 2025

నిస్వార్ధంగా పనిచేసిన వారికి అవకాశం: బాల్క సుమన్

image

పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. రానున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి చెన్నూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆయా పరిధిలోని గ్రామాల వారీగా సమీక్షించి ఎంపిక చేస్తామన్నారు.

News October 8, 2025

VKB: సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: అ.కలెక్టర్

image

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ ఐదు నుంచి 12 వరకు గ్రామపంచాయతీలో మండల కార్యాలయాల్లో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పౌరుడు అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వాలని తెలిపారు.