News October 8, 2025
MHలో రిజర్వేషన్లు 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసింది: పిటిషనర్లు

TG: బీసీల రిజర్వేషన్ల పెంపు అధికారం ప్రభుత్వానికి ఉన్నా అది 50 శాతం మించకూడదని పిటిషనర్ల తరఫు లాయర్లు హైకోర్టులో వాదించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల వల్ల సీలింగ్ 50% దాటిందని పేర్కొన్నారు. బీసీల కులగణనపై ఏకసభ్య కమిషన్ నివేదిక పారదర్శకంగా లేదన్నారు. రిజర్వేషన్లపై జీవోలు 9, 41లను సవాల్ చేస్తున్నామని వివరించారు.
Similar News
News October 8, 2025
నవోదయ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో సీట్ల భర్తీకి అప్లికేషన్ గడువును మరోసారి పొడిగించారు. మొదట సెప్టెంబర్ 23తో దరఖాస్తు గడువు ముగియగా దానిని అక్టోబర్ 7 వరకు పెంచారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని JNV అధికారులు తెలిపారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు.
News October 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 8, 2025
చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>