News October 8, 2025
BC రిజర్వేషన్లపై విచారణకు లంచ్ బ్రేక్

TG: BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణకు లంచ్ బ్రేక్ ప్రకటించిన జడ్జి 2:30pm నుంచి వాదనలు వింటామన్నారు. అంతకుముందు వాదనల్లో.. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి పాత చట్టం అమల్లో ఉన్నట్లే అని, దీంతో జీవో చెల్లదని పిటిషనర్ వాదించారు. అటు బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లాక గడువులోపు సంతకం పెట్టకుంటే కేబినెట్కు వస్తుందని, మళ్లీ పంపినా తర్వాత సానుకూల నిర్ణయం రాకుంటే జీవో ఇవ్వాలన్నారు.
Similar News
News October 8, 2025
‘దీపావళి’ వెలుగులు నింపాలి.. విషాదం కాదు!

దీపావళి అనగానే ‘బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. కార్మికులు సజీవ దహనం’ అనే వార్తలు వింటూ ఉంటాం. తాజాగా AP కోనసీమ జిల్లాలోనూ అలాంటి ప్రమాదమే జరిగి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తరచూ బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలను తనిఖీ చేయాలి. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. కార్మికులకు జీవిత బీమా చేయించాలి. ఈ పండుగ కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపకుండా చూసుకోవాలి.
News October 8, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ NTR, GNT, బాపట్ల, అనంత, సత్యసాయి తదితర జిల్లాల్లో వర్షం పడింది.
News October 8, 2025
రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కోర్టులో తమ లాయర్లు బలమైన వాదనలు వినిపించారని, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, కోర్టులోనూ కచ్చితంగా గెలుస్తామన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.