News April 7, 2024
అన్నం వండలేదని ఫ్రెండ్ను చంపేశారు
అన్నం వండలేదని ఓ వ్యక్తిని అతడి స్నేహితులే కొట్టి చంపారు. ఈ ఘటన HYDలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. బిహార్కు చెందిన బినయ్ సింగ్, సోనూతివారీ, సందీప్, హన్స్రామ్ కుత్బుల్లాపూర్లోని ఓ గదిలో అద్దెకుంటూ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సందీప్, సోనూ మద్యం తాగి గదికి వచ్చారు. అన్నం ఎందుకు వండలేదని ఇద్దరూ కలిసి హన్స్రామ్ను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News October 9, 2024
చిట్టినాయుడి ప్రజా పాలన మాటలకే పరిమితం: BRS
TG: రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. చిట్టినాయుడి ప్రజా పాలన కేవలం మాటలకే పరిమితమైందని, మూడు నెలలు గడిచినా పంచాయతీ కార్మికులకు జీతాలు అందలేదని పేర్కొంది. జీతాలు రాక తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ వాళ్లు నిరసన చేపడుతున్నారని ట్వీట్ చేసింది. ఈ ప్రభుత్వం పండుగలకు కార్మికులను పస్తులు ఉంచుతోందని మండిపడింది.
News October 9, 2024
‘యానిమల్’ రోల్పై ట్రోలింగ్తో ఏడ్చేశా: త్రిప్తి
‘యానిమల్’లో తాను పోషించిన రోల్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు రావడంతో నటి త్రిప్తి దిమ్రీ 2-3 రోజులు ఏడుస్తూ కూర్చున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సందీప్రెడ్డి డైరెక్షన్లో రణ్బీర్ హీరోగా వచ్చిన ఆ మూవీలో త్రిప్తి బోల్డ్ క్యారెక్టర్ చేశారు. దానిపై వచ్చిన ట్రోలింగ్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. అయితే కొన్నిసార్లు ఏడవటమూ గాయం నుంచి బయటపడేస్తుందని చెప్పుకొచ్చారు.
News October 9, 2024
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.