News October 8, 2025
భద్రాద్రి: మండలాలకు చేరిన బ్యాలెట్ బాక్సులు

స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాలకు తరలించారు. బుధవారం రోజున జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ గోడౌన్ నుంచి ఈ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.
News October 8, 2025
KMR: జిల్లాలో భారీ వర్ష నష్టంపై కేంద్ర బృందం రివ్యూ

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం పీకే రాయ్ (జాయింట్ సెక్రెటరీ, హోమ్ అఫైర్స్) నేతృత్వంలో బుధవారం జిల్లాలో పర్యటించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో మీట్ అయ్యారు. 3 రోజుల్లోనే జిల్లాలో సగటు వర్షపాతం 40 శాతం కురిసిందని, దీనివల్ల రహదారులు, వంతెనలు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
News October 8, 2025
జగన్ పర్యటనలో మార్పులు: గుడివాడ అమర్నాథ్

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.