News October 8, 2025

హుజూరాబాద్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

image

హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువలో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృత దేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, రెండు రోజుల క్రితం కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. శవం ఉబ్బిపోవడంతో గుర్తింపు కష్టతరమైందని పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణం, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 8, 2025

KMR: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలి: SEC

image

ZPTC, MPTC, MPP ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.

News October 8, 2025

యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్‌ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.

News October 8, 2025

KMR: జిల్లాలో భారీ వర్ష నష్టంపై కేంద్ర బృందం రివ్యూ

image

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం పీకే రాయ్ (జాయింట్ సెక్రెటరీ, హోమ్ అఫైర్స్) నేతృత్వంలో బుధవారం జిల్లాలో పర్యటించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో మీట్ అయ్యారు. 3 రోజుల్లోనే జిల్లాలో సగటు వర్షపాతం 40 శాతం కురిసిందని, దీనివల్ల రహదారులు, వంతెనలు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.