News October 8, 2025
GST సవరణలతో పేదకు ఉపశమనం: కలెక్టర్

GST సవరణలతో పేదకు ఉపశమనం లభించిందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బుధవారం చందోలు గ్రామంలో విద్యార్థులకు GST సంస్కరణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన GST నిబంధనలతో పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులకు అవసరమైన నిత్యవసరాల ధరలు తగ్గాయని వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
Similar News
News October 8, 2025
KMR: ఎన్నికల కోడ్ను అమలు చేయాలి: SEC

ZPTC, MPTC, MPP ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. మొదటి విడతలో 14 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.
News October 8, 2025
KMR: జిల్లాలో భారీ వర్ష నష్టంపై కేంద్ర బృందం రివ్యూ

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం పీకే రాయ్ (జాయింట్ సెక్రెటరీ, హోమ్ అఫైర్స్) నేతృత్వంలో బుధవారం జిల్లాలో పర్యటించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో మీట్ అయ్యారు. 3 రోజుల్లోనే జిల్లాలో సగటు వర్షపాతం 40 శాతం కురిసిందని, దీనివల్ల రహదారులు, వంతెనలు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.