News October 8, 2025
MBU ప్రతిష్ఠను దిగజార్చాలనే ఇవన్నీ: విష్ణు

మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా APHERMC చేసిన సిఫార్సులను మంచు విష్ణు ఖండించారు. ‘ఆ సిఫార్సులపై <<17943028>>MBU<<>>కు మద్దతుగా హైకోర్టు స్టే ఇచ్చింది. వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చాలనే కొంత సమాచారాన్నే ప్రచారం చేస్తున్నారు. ఈ నిరాధారమైన వార్తలను నమ్మొద్దని కోరుతున్నాం. ఎంతో మందికి ఉచిత విద్య అందించాం. అనాథలను దత్తత తీసుకుని సంరక్షించాం. ఆర్మీ, పోలీసుల పిల్లలకు పూర్తి స్కాలర్షిప్ ఇచ్చాం’ అని తెలిపారు.
Similar News
News February 16, 2026
పాక్పై విజయం.. అప్పుడూ శివరాత్రి రోజే..!

T20 WCలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా <<19153355>>ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల కిందట కూడా శివరాత్రి రోజే పాక్తో ODI WC మ్యాచ్ జరిగింది. 2003 మార్చి 1న తొలుత పాక్ 273 పరుగులు చేయగా, సచిన్ చెలరేగడంతో 45.4 ఓవర్లలోనే ఇండియా గెలిచింది. సచిన్ 98 పరుగులతో త్రుటిలో సెంచరీ కోల్పోయారు. మరోవైపు 2015 ODI WCలో FEB 15నే పాక్ను మన జట్టు ఓడించింది.
News February 16, 2026
ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం(ఫొటోలో)
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త, Ex MP లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు
News February 16, 2026
UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.


