News October 8, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి మూల్యాంకనం ప్రారంభం

జిల్లాలో గత నెలలో జరిగిన ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశామని అన్నారు.
Similar News
News March 22, 2026
SMలో నిందితుల దృశ్యాలు.. తప్పుపట్టిన సుప్రీంకోర్టు

నిందితుల ఫొటోలు, వీడియోలను ప్రజలు వెంటనే SMలో పోస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాగే సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలను పోలీసులే షేర్ చేయడం ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొంది. వీటి వల్ల పారదర్శక విచారణకు ముప్పు కలుగుతుందని తెలిపింది. ఇలాంటి వాటిని నియంత్రించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News March 22, 2026
భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తోందా?

రాత్రి భోజనం తిన్నాక అర్ధరాత్రి మళ్లీ ఆకలి వేసే సమస్య పెరుగుతోంది. దీంతో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు. ‘రాత్రి ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పెరుగన్నం, గుప్పెడు నట్స్ తిన్నా, పసుపు కలిపిన గ్లాసు గోరు వెచ్చని పాలు తాగినా ఆకలి తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు.
News March 22, 2026
ఈ జర్నీ అంత సులభం కాదు: అనయా బంగర్

ఇటీవల లింగ మార్పిడి <<19387841>>సర్జరీ<<>> చేయించుకున్న భారత్ మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు అనయా బంగర్ SMలో భావోద్వేగ పోస్ట్ చేశారు. అమ్మాయిగా మారాలనే తన నిర్ణయాన్ని తన తండ్రి, ఫ్యామిలీ సపోర్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదని తెలిపారు. తన తండ్రి అండగా ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనయాబంగర్గా గుర్తింపును మార్చుకున్న ఆర్యన్ బంగర్ 2024లో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, రీసెంట్గా ఈ సర్జరీ చేయించుకున్నారు.


