News October 8, 2025

RDT కోసం చేసిన పోరాటం ఫలించినట్లేనా?

image

RDTకి FCRA రెన్యువల్ కోసం కొన్ని నెలలుగా వివిధ సంఘాల నాయకులు, ప్రజలు చేస్తున్న పోరాటం ఫలించినట్లు తెలుస్తోంది. FCRA రెన్యువల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే శుభవార్త వెలువడనున్నట్లు SAVE RDT పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్..!

Similar News

News October 8, 2025

సంగారెడ్డి: ‘అన్ని పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు’

image

జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతులకు అమలు చేసే విధంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

News October 8, 2025

SRCL: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 8, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.