News October 8, 2025
పోలీసు సేవలు మెరుగుపరచాలి: ఎస్పీ నరసింహా

సూర్యాపేట: పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహా బుధవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, పోలీసు పరికరాలు, సిబ్బంది కవాతును ఆయన పరిశీలించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. అంతకు ముందు ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య, ఎస్ఐలు, సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనంతో స్వాగతం పలికారు.
Similar News
News October 8, 2025
స.హ చట్టంతో పాలనలో కీలక మార్పులు: కలెక్టర్

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం సమాచార హక్కు చట్టం-2005లో అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సమాచార హక్కు చట్టం- 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు.
News October 8, 2025
మెదక్: పోటాపోటీగా అండర్-17 బాలబాలికల పోటీలు

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాల, బాలికలకు కబడ్డీ పోటీలు బుధవారం జరిగాయి. 210 మంది బాలికలు, 210 మంది బాలురు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ఎంపికైన మెదక్ జిల్లా జట్టు ఇదే నెల 10న సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా పోటీలలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర పీఈటీల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు.
News October 8, 2025
అమ్మ సంబరాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించాం: EO

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయవంతంగా ముగిసిందని ఆలయ సహాయ కమిషనర్ కె.శిరీష బుధవారం తెలిపారు. సిరిమానోత్సవం సాఫీగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి కృషిచేసిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, భక్తులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సిరిమాను సంబరాన్ని సంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించామన్నారు.