News October 8, 2025

సయోధ్య సరే.. మంత్రుల మధ్య గ్రూపుల సంగతేంటి?

image

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య సయోధ్య సరే గాని, మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాల సంగతేంటని కాంగ్రెస్ శ్రేణులు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పరిష్కరించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం ఖాయమంటున్నాయి. అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించి నేతలను ఏకతాటి పైకి తీసుకువచ్చి గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

Similar News

News October 8, 2025

MBNR: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు

image

మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. తొలి విడతలో 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 8, 2025

NLG: ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

నల్గొండ జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం నుంచి అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, ఎన్నికల కోడ్, 100 మీటర్ల పరిధి నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 8, 2025

రేపు చలో బస్‌భవన్‌కి కేటీఆర్ పిలుపు

image

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు చలో బస్ భవన్ పిలుపు నిచ్చింది. ఉ.9 గంటలకు రైతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజిమంత్రులు, బీఅరెస్ నేతలు ప్రయాణించనున్నారు.