News October 8, 2025
AP న్యూస్ అప్డేట్స్

* అమరావతిలో CRDA ప్రాజెక్టు కార్యాలయాన్ని ఈనెల 13న 9.54AMకు ప్రారంభించనున్న CM చంద్రబాబు
* లిక్కర్ స్కాం కేసు: MP మిథున్ రెడ్డి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని సిట్కు ACB కోర్టు ఆదేశం.. US జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ ఇప్పించాలని కోరిన MP
* 21 మందితో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీని నియమించిన ప్రభుత్వం
* రాష్ట్రంలో 274 రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
Similar News
News October 8, 2025
పాక్ PMని ‘పెట్’తో పోల్చిన హర్ష్ గోయెంకా

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సెటైరికల్గా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ప్రధాని మోదీ పుంగనూరు ఆవును, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు కుక్కలను పట్టుకున్న ఫొటోను ఆయన Xలో షేర్ చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కన మాత్రం పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఉన్నారు. దీనికి ‘గ్లోబల్ లీడర్లు అందరికీ వారి వారి ఫేవరెట్ పెట్స్ ఉన్నాయి’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు.
News October 8, 2025
దగ్గు సిరప్పై కేంద్రం కీలక ఆదేశాలు

దగ్గు సిరప్తో MP, రాజస్థాన్లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
News October 8, 2025
పాకిస్థాన్ ఘోర ఓటమి

WWCలో భాగంగా AUSతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత AUS 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్(35) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించారు. WWCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. దీంతో పాయింట్ల టేబుల్లో చివర నిలిచింది.