News October 8, 2025
నెల్లూరు: దాహం తీర్చేవారేరి..!

దుత్తలూరు(M) నందిపాడు ఎస్సీ కాలనీ, వరికుంటపాడు(M) దక్కనూరు, వింజమూరు(M) కాటేపల్లి బీసీ కాలనీ, కొడవలూరు(M)గండవరంలో RO ప్లాంట్ల ఏర్పాట్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిల్లో రూ.29 లక్షలతో ప్లాంట్లను నెలకొల్పాలని తీర్మానించారు. వీకేపాడులో కేవలం భవనం కట్టి వదిలేయగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు వీటిపై పునఃసమీక్షించాలని ప్రజలు కోరారు.
Similar News
News October 9, 2025
టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
News October 9, 2025
10న వెంకటాచలం రానున్న CM..

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.
News October 8, 2025
నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ఓపెనింగ్ ఎప్పుడో..?

పొదుపు మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో పైలట్ ప్రాజెక్టుగా <<17847829>>స్మార్ట్ స్ట్రీట్<<>> ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో చాలా రోజుల కిందటే అక్కడి దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కంటైనర్లతో స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. దసరా తర్వాత ప్రారంభించాలని 4వ తేదీన ముహూర్తం కుదిర్చారు. ఏమైందో ఏమో ఓపెనింగ్ను మర్చిపోయారు. వీటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి మరి.