News October 8, 2025

విజయవాడ: RTC పైసా వసూల్..!

image

దసరా సందర్భంగా విజయవాడ PNBSకు SEP 24 నుంచి OCT 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.20.20 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 40 లక్షల మంది పండుగ రోజుల్లో రవాణా చేశారు. PNBS పరిధిలో మొత్తం 750 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక గత ఏడాది కేవలం 20 లక్షల మందే ట్రావెల్ చేయగా.. రూ.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఉచిత బస్సు పథకం వల్ల 50% ప్రయాణికులు సంఖ్య, 25% ఆదాయం పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు.

Similar News

News October 9, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
✓ లింక్ క్లిక్ చేసి రూ.1.25 లక్షలు పోగొట్టుకున్న పాల్వంచ యువకుడు
✓ భద్రాచలంలో రూ.10 లక్షల బాణసంచా సీజ్
✓ భద్రాద్రి: మండలాలకు చేరిన బ్యాలెట్ బాక్సులు
✓ నోటికాడి కూడు లాక్కోవద్దని పినపాక పోడు రైతుల ఆవేదన
✓ కొత్తగూడెం: CJIపై దాడి చేసిన వారిని శిక్షించాలి: యూత్ కాంగ్రెస్
✓ములకలపల్లి: పిడుగుపాటుకు ఇల్లు దగ్ధం

News October 9, 2025

భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

image

జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన భూగర్భ జల అంచనా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ వంటి చర్యల ద్వారా నీటిమట్టం మెరుగుపడిందన్నారు. భూగర్భ జల ఉపసంహరణ నిబంధనలు–2023ను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News October 9, 2025

కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CBN

image

AP: కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్‌ ఘటనపై YCP రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.