News October 8, 2025
పార్టీ మారినా ఎమ్మెల్సీ పద్మశ్రీకి దక్కని ప్రాధాన్యత!

కాకినాడ: ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన MLC కర్రి పద్మశ్రీని అవమానాలు వెంటాడుతున్నాయి. అందరూ ఎమ్మెల్సీలను పిలుస్తున్నా.. ఇంతవరకు ఆమెను మాత్రం జడ్పీ సర్వసభ్య సమావేశానికి పిలవలేదట. గతంలో YCPలో ఉన్నప్పుడూ ప్రాధాన్యత దక్కలేదని ఆమె అనుచరులు వాపోతున్నారు. నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీని ఎదగనివ్వలేదంటున్నారు. ఇప్పుడు TDPలో చేరగా MLA కొండబాబు సైతం పద్మశ్రీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
Similar News
News October 9, 2025
తెలుగు టైటాన్స్ ‘తగ్గేదేలే’.. వరుసగా ఐదో విజయం

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు హరియాణా స్టీలర్స్తో మ్యాచులో 46-29 తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 8 గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో భరత్ 20, విజయ్ మాలిక్ 8 పాయింట్లు సాధించారు. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
News October 9, 2025
గుర్తుంచుకోండి.. మీ కర్మలకు మీరే బాధ్యులు!

ఒకప్పుడు దొంగగా ఉన్న బోయవాడు ‘నా పాపంలో భాగం పంచుకుంటారా’ అని కుటుంబసభ్యులను అడిగితే.. వాళ్లు ‘వద్దు’ అని తేల్చి చెప్పారు. ఆ మాటకు జ్ఞానోదయం పొందిన ఆ బోయవాడు నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠించి, పాప విముక్తుడై వాల్మీకిగా మారి, రామాయణాన్ని రచించాడు. లోకం కూడా అంతే! ఎప్పుడూ తన లాభాలనే చూస్తుంది. మన కర్మలకు మనమే బాధ్యులమవుతాం. ఈ సత్యాన్ని తెలుసుకొని మంచి మార్గంలో పయనిస్తేనే ఆయనలా మహర్షులం అవుతాం.
News October 9, 2025
భద్రాద్రి: శాంతి చర్చలకు సిద్ధమే: మావోయిస్టు పార్టీ

రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం తమతో చర్చలు జరపడానికి చొరవ తీసుకోవాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమైఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సోను (అభయ్) చేసిన శాంతి ప్రతిపాదనను సికస సమర్థిస్తుందని అశోక్ స్పష్టం చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.