News October 8, 2025
రాధికను అభినందించిన ఎస్పీ జానకి

కాంస్య పతకం సాధించిన అడ్డాకల్ PSకు చెందిన కానిస్టేబుల్ రాధికను MBNR ఎస్పీ డి.జానకి అభినందించారు. హరియాణాలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్(ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్)–2025-26లో తెలంగాణ పోలీస్ బృందం తరపున పాల్గొన్న రాధిక 80+ కేటగిరీలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారు. దీంతో రాధికను తన చాంబర్లో శాలువా కప్పి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 10, 2026
తగ్గనున్న మద్యం ధరలు.. ఎంతంటే?

AP: రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్, వైన్ బ్రాండ్ల ధరలను తగ్గించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వాటి అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 20 ఖరీదైన బ్రాండ్ల మద్యం ధరలను తగ్గించనుంది. క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఒక్కో సీసాపై రూ.3వేల వరకూ తగ్గనున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
News March 10, 2026
యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరా?: SC

యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా పునరావాస పథకం ఎందుకు తీసుకురాలేదని రాష్ట్రాలు, UTలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించే పథకాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఉద్యోగాలు ఇవ్వడంలో ఏవైనా సమస్యలుంటే జీవన భత్యం చెల్లించేలా పాలసీ తీసుకురావాలని సూచించింది. హరియాణాకు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News March 10, 2026
చిత్తూరు: ఏడుగురు సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు

ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ జిల్లా సర్వే భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీచేశారు. తోటి సర్వేయర్లను విధులకు హాజరు కానీయకుండా చేశారనే కారణంతో సర్వేయర్ల యూనియన్ ఆఫీస్ బేరర్స్లోని నాయకులకు షోకాజ్ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో గతంలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


