News April 7, 2024
వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 3, 2025
ఉదయం 8 తర్వాత హెవీ వెహికల్స్కు ప్రవేశం లేదు: ట్రాఫిక్ డీఎస్పీ

ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ గుంటూరులోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో నగరంలోని హెవీ వెహికల్స్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాత్రి 10:00 నుంచి ఉదయం 8 గంటల లోపు మాత్రమే హెవీ వెహికల్స్ నగరంలోకి ప్రవేశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సింగయ్య పాల్గొన్నారు.
News April 3, 2025
వసతీ గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళల పై నేరాల నియంత్రణ కోసం ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్సీ మీటింగ్ హాలులో బుధవారం ఎస్పీ సతీశ్ కుమార్తో కలిసి నేరాల నియంత్రణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వసతీ గృహాల స్వాగత ద్వారంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News April 2, 2025
బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్టీఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.