News October 8, 2025
ధరూర్: ‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి’

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం ధరూర్ మండలంలో పర్యటించి బడి మానేసి పొలాల్లో పని చేస్తున్న వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. పాతపాలెంలో పొలాల్లో పనిచేస్తున్న ఓ విద్యార్థిని గుర్తించి బడిలో చేర్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, మెరుగైన విద్య ఇవ్వాలని టీచర్లకు సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Similar News
News October 9, 2025
భారత్తో విభేదాలు.. ట్రంప్కు US లా మేకర్స్ వార్నింగ్

భారత్తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో US కాంగ్రెస్కు చెందిన 19 మంది లా మేకర్స్ ట్రంప్కు లేఖ రాశారు. ఇండియాతో రిలేషన్స్ మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సఖ్యత లేకపోవడం ప్రతికూలంగా మారుతుందని హెచ్చరించారు. భాగస్వామ్యాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. భారత గూడ్స్పై 50% టారిఫ్స్ విధించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
News October 9, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 09, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.11 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 9, 2025
VKB: రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్కు అందించాలి: అ. కలెక్టర్

రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా రైస్ మిల్లర్లు బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. సకాలంలో బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.