News October 8, 2025

సంగారెడ్డి: ‘ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి’

image

ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్టేజి వన్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ ప్రక్రియపై శిక్షణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులు, సమయపాలన కీలకమని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తమ విధుల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

image

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

News March 15, 2026

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్‌లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

News March 15, 2026

కర్నూలు: ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్‌ను మోసం చేసిన ఘనుడు

image

ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన ట్రాన్స్‌జెండర్ గీతను, చిన్నటేకూరుకు చెందిన పరశురాం ప్రేమ పేరుతో వంచించినట్లు బాధితురాలు ఆరోపించింది. 2024 నుంచి పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు డబ్బు అడిగితే అసభ్యకరంగా దూషిస్తూ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని గీత పోలీసులను ఆశ్రయించింది.