News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.
Similar News
News October 9, 2025
అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని SP శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా(ఫొటోలో) మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ జననం
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం
✦ ప్రపంచ కంటిచూపు దినోత్సవం
News October 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 9, 2025
భూములిచ్చిన ఊళ్లలోనే రిటర్నబుల్ ప్లాట్లు: CM చంద్రబాబు

AP: అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఊళ్లో భూములిచ్చిన రైతులకు ఆ ఊళ్లోనే రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో 53వ CRDA అథారిటీ సమావేశంలో మొత్తంగా 18 అంశాలపై చర్చించారు. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది.