News October 8, 2025
స.హ చట్టంతో పాలనలో కీలక మార్పులు: కలెక్టర్

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం సమాచార హక్కు చట్టం-2005లో అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సమాచార హక్కు చట్టం- 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు.
Similar News
News October 9, 2025
ADB: స్కాలర్ షిప్ కోసం APPLY చేసుకోండి

2025-26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ పాస్ http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖాధికారి రాజలింగు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు.
..SHARE IT
News October 9, 2025
ADB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి విడతలో 80 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.
News October 9, 2025
ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటొద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిషనర్ నిర్దేశించిన వ్యయ గరిష్ట పరిమితిని మించి ఖర్చు చేయరాదని నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.