News October 8, 2025

VZM: ‘వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ’

image

జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఎస్.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వేడి నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.

Similar News

News October 9, 2025

VZM: సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పథకంపై ప్రచారం

image

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పథకం ప్రచారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వక్తృత్వ పోటీలను బుధవారం నిర్వహించారు. జీఎస్టీ ప్రయోజనాలు, పన్ను పారదర్శకతపై విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. యువతలో ఆర్థిక అవగాహన కోసం కార్యక్రమాన్ని నిర్వహించామని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మలా జ్యోతి తెలిపారు. విజేతలకు జిల్లా స్థాయిలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

News October 8, 2025

అమ్మ సంబరాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించాం: EO

image

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయవంతంగా ముగిసిందని ఆలయ సహాయ కమిషనర్ కె.శిరీష బుధవారం తెలిపారు. సిరిమానోత్సవం సాఫీగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి కృషిచేసిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, భక్తులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సిరిమాను సంబరాన్ని సంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించామన్నారు.

News October 8, 2025

సిరిమాను చెక్క కోసం బారులు తీరిన భక్తులు

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం సిరిమాను చెక్కలను తీసుకొని వెళ్లడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిమాను చెక్కలను తీసుకెళ్లిన భక్తులు వారి ఇంటిలో ఉంచుకుంటారు. దీంతో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.