News April 7, 2024
ఫార్మా కంపెనీలో ప్రమాదం.. విజయనగరం జిల్లా వ్యక్తి మృతి

పరవాడ <<13006759>>ఫార్మాసిటీ<<>>లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆల్కాలి మెటల్ కంపెనీలో గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన సీహెచ్.రమణ(33), అరబిందో కంపెనీలో పెదగంట్యాడలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన ఆల్ల గోవింద్(34) ప్రాణాలు విడిచారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని CITUనాయకులు డిమాండ్ చేశారు.
Similar News
News April 2, 2025
విశాఖలో హత్యకు గురైన విజయనగరం మహిళ

విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్లో ప్రేమోన్మాది నవీన్ చేసిన దాడిలో గాయపడ్డ నక్కా దీపిక(20) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఘటనా స్థలంలోనే ఆమె తల్లి లక్ష్మి (43) మృతి చెందింది. రేగిడి మండలం పుర్లికి చెందిన బాధితురాలి తండ్రి రాజు విశాఖ వలస వచ్చి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొమ్మాదిలోని స్వయంకృషినగర్లో అద్దెకు ఉంటున్నారు. యువతి పెళ్ళికి అంగీకరించకపోవటంతో హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.
News April 2, 2025
విజయనగరం: ‘ఉద్యాన పంటల సాగు పెంచేందుకు కార్యాచరణ’

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత జిల్లా పరిస్థితులను బట్టి వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఉద్యానసాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం తమ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
News April 2, 2025
VZM: ‘మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి’

మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష జరిపారు. మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.