News October 9, 2025
ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటొద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిషనర్ నిర్దేశించిన వ్యయ గరిష్ట పరిమితిని మించి ఖర్చు చేయరాదని నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News October 9, 2025
నామినేషన్ కోసం కావలసిన పత్రాలు ఇవే

స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత ఎంపీటీసీ,జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తో పాటు ఓటర్ ఐడీ,3 పాస్ పోర్ట్ పోటోలు,ఎన్నికల డిపాజిట్ రసీదు సమర్పించాలి. పార్టీకు సంబంధించిన అభ్యర్థులు బి.ఫామ్ జతచేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల దృవపత్రంపై గజిటెడ్ సంతకం చేయించి అటాచ్ చేయాలి. కొత్త బ్యాంక్ ఖాతా ఆర్.ఓ కు సమర్పించాలి.
News October 9, 2025
ఎల్.ఎన్.పేట: ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట మండలం జంబాడ గ్రామానికి సమీపంలోని కడగండి రిజర్వాయర్లో నిమ్మక సతీష్ (23) ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. బుధవారం సాయంత్రం రిజర్వాయర్ వద్దకు జంబాడ గ్రామానికి చెందిన నిమ్మక సతీష్, కొండగొర్రె లక్ష్మీనారాయణ, పాలక సతీష్ వెళ్లారు. రిజర్వాయర్ మదుము (కాన) వద్ద నిమ్మక సతీష్ దిగి మదములో పడిపోయాడు. ఆసుపత్రికి తరలించిగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 9, 2025
విజయవాడ బస్టాండ్ థియేటర్లో బొమ్మ పడుతుందా!

విజయవాడ PNBS బస్టాండ్లో 2 మినీ థియేటర్లు, దుకాణాల టెండర్లకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. 35 షాపుల్లో 19కి మాత్రమే 50 మంది వేలంలో పాల్గొన్నారు. 6 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలనడం, ఇతర నిబంధనలతో వ్యాపారులు మందుకు రావట్లేదని తెలుస్తోంది. 2 థియేటర్ల లీజుకు ఇద్దరే ముందుకు రాగా.. రూ.3-4 లక్షల లీజు వస్తే ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. కాగా గతంలో ప్రయాణికుల్ని అలరించిన ఈ థియేటర్లు నిరుపయోగంగా మారాయి.