News October 9, 2025

జడ్చర్లలో పాముకు చికిత్స

image

జడ్చర్ల పట్టణంలో కరెంట్ షాక్‌కు గురై గాయపడిన పాముకు చికిత్స అందించారు. పట్టణంలోని ఓ పరిశ్రమ పవర్ బోర్డులో చేరి పవర్ బోర్డులోకి చేరిన సుమారు ఎనిమిది అడుగుల జెర్రిపోతు కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు గమనించిన పరిశ్రమ యజమాని సమాచారం ఇచ్చారు. ఆయన శిష్యులు శ్రీకాంత్, శివకుమార్ వచ్చి దాన్ని రక్షించారు. అనంతరం డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

Similar News

News October 9, 2025

MBNR: అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని ఆమె కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News October 9, 2025

MBNR: నామినేషన్ ప్రక్రియ.. పటిష్ట నిఘా: SP

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పటిష్ట నిఘా ఉంచినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని, డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనలు ఉంటాయని, బారికేడ్లు ఏర్పాటు చేశామని ఆమె వివరించారు.
SHARE IT

News October 9, 2025

ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో 13.8 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 8.5 మి.మీ., జడ్చర్లలో 6.5 మి.మీ., నవాబుపేటలో 3.5 మి.మీ., మిడ్జిల్‌లో 2.8 మి.మీ., కౌకుంట్ల 2.0 మి.మీ., చిన్నచింతకుంటలో 1.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.