News April 7, 2024
2014కు ముందు ఉన్న పరిస్థితే వస్తుంది: జగదీశ్ రెడ్డి
TG: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుదారులను పక్కనే పెట్టుకుని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి నిర్మించిన వాటిని వంద రోజుల్లోనే నాశనం చేశారని అన్నారు. కొత్తగా మారుస్తారనుకుంటే.. 2014కు ముందు ఉన్న ఆత్మహత్యలు, ఆకలి చావుల పరిస్థితులే వస్తాయన్నారు.
Similar News
News October 9, 2024
వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు: మంత్రి అనిత
AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
News October 9, 2024
CM రేవంత్రెడ్డిని కలిసిన BRS MLA మల్లారెడ్డి
TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.
News October 9, 2024
J&K ప్రజలకు కృతజ్ఞతలు: రాహుల్ గాంధీ
జమ్మూకశ్మీర్లో తమ కూటమి సాధించిన గెలుపు రాజ్యాంగ విజయంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. విజయాన్ని అందించిన J&K ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని తెలిపారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని ట్వీట్ చేశారు.