News October 9, 2025

గోదావరిఖని- తిరుపతికి ప్రత్యేక సూపర్ లగ్జరీ

image

ఈనెల 12న GDK నుంచి అరుణాచలం, తిరుపతికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేసినట్లు RTC DM నాగభూషణం తెలిపారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,200 ఛార్జ్ నిర్ణయించామన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి దర్శనాలు చేసుకొని GDK వస్తామన్నారు. ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 16న రాత్రి GDK చేరుకుంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలన్నారు

Similar News

News October 9, 2025

భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

image

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.

News October 9, 2025

శ్రీశైలం అధికారులకు సీఎం ప్రశంస

image

రాష్ట్ర ప్రజలకు శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 16న PM మోదీ శ్రీశైలానికి రానుండటంతో సీఎం పేరుతో ఓ లెటర్ విడుదలైంది. శ్రీశైల దేవస్థానం ప్రతినిధులు ‘శ్రీశైల నూతన తామ్ర శాసనాలు’ అనే గ్రంధాన్ని ప్రచురించడం, ప్రధాని తిలకించేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రదర్శన పెట్టడం అభినందనీయమని సీఎం కొనియాడారు.

News October 9, 2025

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: డిప్యూటీ స్పీకర్

image

పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రతన్ వర్ధంతి సందర్భంగా పెద అమిరంలోని ఆయన విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశ్రామిక రంగానికే కాక, ప్రపంచానికే ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.