News October 9, 2025
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

TG: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. మొదటి విడతలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రోజూ ఉ.10.30 నుంచి సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 13న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
Similar News
News October 9, 2025
మరోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా.. విజయ్కు బెదిరింపులు!

సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్ 100కు కాల్ చేసిన దుండగుడు ‘విజయ్ మరోసారి పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తే ఆయన ఇంట్లో బాంబు పెడతా’ అని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో చెన్నైలోని విజయ్ ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు లొకేషన్ను ట్రేస్ చేస్తున్నారు. ఇటీవల కరూర్లో విజయ్ పర్యటించగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News October 9, 2025
కరీనాకపూర్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఏజ్ పెరిగేకొద్దీ యంగ్గా, ఫిట్గా కనిపిస్తున్నారు. ఇద్దరుపిల్లల తల్లైనా ఫిట్గా ఉండటానికి కారణం హెల్తీ లైఫ్స్టైలేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. రోజూ సాయంత్రం 6 లోపు డిన్నర్ చేసి 9.30కి నిద్రపోతానని తెలిపారు. నైట్ పార్టీలకు దూరంగా ఉంటానని, రెగ్యులర్ వర్కవుట్స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తానని పేర్కొన్నారు. పరాఠా, కిచిడీ ఇష్టమైన ఫుడ్స్ అని తెలిపారు.<<-se>>#celebrity<<>>
News October 9, 2025
జీవ ఎరువుల వాడకంతో కలిగే ప్రయోజనాలు

పంటకు <<17939337>>జీవ ఎరువు<<>>లను అందించడం వల్ల హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై అవి ఆరోగ్యకరంగా, వేగంగా పెరుగుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం 20 నుంచి 25 శాతం మేర తగ్గించుకోవచ్చు. జీవ ఎరువుల వల్ల పంట సాధారణ దిగుబడి 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.