News October 9, 2025

నామినేషన్ కోసం కావలసిన పత్రాలు ఇవే

image

స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత ఎంపీటీసీ,జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తో పాటు ఓటర్ ఐడీ,3 పాస్ పోర్ట్ పోటోలు,ఎన్నికల డిపాజిట్ రసీదు సమర్పించాలి. పార్టీకు సంబంధించిన అభ్యర్థులు బి.ఫామ్ జతచేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల దృవపత్రంపై గజిటెడ్ సంతకం చేయించి అటాచ్ చేయాలి. కొత్త బ్యాంక్ ఖాతా ఆర్.ఓ కు సమర్పించాలి.

Similar News

News October 9, 2025

నాగర్‌కర్నూల్‌లో 6.47 లక్షల ఓటర్లు

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 6,47,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు; రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

News October 9, 2025

JNG: పేరెంట్స్ GREAT.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టారు

image

రఘునాథపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్(29) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుని అవయవాలు దానం చేసి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణదానం చేశారు.

News October 9, 2025

ఎన్నికల సిత్రాలు షురూ: ఎర్రగడ్డలో మిర్చి బజ్జీ వేసి!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సిత్రాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో BRS అభ్యర్థి మాగంటి సునీత తన దైన శైలిలో వెళుతున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని బి.శంకర్‌లాల్‌నగర్, సుల్తాన్‌నగర్‌లో కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావుతో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఓ హోటల్ వద్ద మిర్చి బజ్జీలు వేశారు. ఉప ఎన్నిక ప్రచారం ముగింపు వరకు ఇంకెన్ని సిత్రాలు ఉంటాయో చూడాలి.