News October 9, 2025

190 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ Eng), CA/CMA, CFMA/MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/

Similar News

News October 9, 2025

కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం: లోకేశ్

image

AP: TDP కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులని, వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడం తన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనుచరుల దాడిలో గాయపడి, అస్వస్థతతో ఇటీవల మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లికి రప్పించి మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయన గట్టిగా పోరాడారని, స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఇలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు.

News October 9, 2025

22 ఏళ్ల సినీ ప్రయాణం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

image

‘లేడీ సూపర్ స్టార్’ నయనతార సినీ పరిశ్రమలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మొదటి సారి కెమెరా ముందు నిల్చొని 22 ఏళ్లయింది. సినిమాలే ప్రపంచమవుతాయని నాకు తెలియదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి మౌనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా నన్ను తీర్చిదిద్దాయి’ అని పేర్కొన్నారు. ఈ బ్యూటీ 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

News October 9, 2025

ముగ్గురితో మొదలై 11వేలమందితో పయనం

image

మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లతో వార్తల్లోకెక్కిన ZOHO, దాని ఫౌండర్ శ్రీధర్‌పై చర్చ జరుగుతోంది. TN లో పేదింట పుట్టిన ఆయన మద్రాస్ IIT, ప్రిన్స్‌టన్ (US)లలో చదివారు. ‘క్వాల్కమ్’ లో పనిచేశారు. 1996లో ఇండియా వచ్చి ‘అడ్వెంట్ నెట్’ స్థాపించారు. అదే జోహోగా మారింది. ముగ్గురితో స్టార్టై ఇపుడు 11000 మందితో ₹1.03లక్షల కోట్లకు ఎదిగింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2021లో పద్మశ్రీ అందించింది.