News October 9, 2025

కృష్ణా: నేటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఆగస్టు 2025లో నిర్వహించిన బి.ఫార్మసీ 4వ, ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు అక్టోబర్ 9వ తేదీలోగా ఎం.ఫార్మసీకి ఒక్కో పేపరుకు రూ.1,100, బి.ఫార్మసీకి రూ.1,000 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.

Similar News

News October 9, 2025

నకిలీ మద్యం కేసును రాజకీయం చేస్తున్నారు: కొల్లు

image

AP: నకిలీ మద్యం కేసుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘తెనాలి వాసి కొడాలి శ్రీనివాస్‌, జయచంద్రారెడ్డి అనే వ్యక్తులకు నకిలీ మద్యంతో సంబంధముంది. ఇబ్రహీంపట్నంకు చెందిన జగన్మోహన్‌రావును పట్టుకున్నాం. ఈ అంశాన్ని ప్రతిపక్షం రాజకీయం చేయడం దారుణం. TDPకి చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాం కానీ YCP నేత శ్రీనివాస్‌పై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదు’ అని మండిపడ్డారు.

News October 9, 2025

మోస్రా: నామినేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

మోస్రాలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. నామినేషన్‌లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ పాల్గొన్నారు.

News October 9, 2025

BPCL రిఫైనరీ కోసం 6వేల ఎకరాలు

image

AP: NLR(D) రామాయపట్నం వద్ద BPCL సంస్థకు ప్రభుత్వం 6వేల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేపిటల్ వ్యయంలో 75% (₹96000 కోట్లు) ఆర్థిక ప్రోత్సాహకాల కింద 20 ఏళ్లలో అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ భూముల్లో ₹1లక్ష కోట్లతో ఆ సంస్థ గ్రీన్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్సును ఏర్పాటుచేస్తుంది. ఈ FYలో ₹4,843కోట్లు, తర్వాత వరుసగా 5 ఏళ్లలో ₹96,862 కోట్లు BPCL పెట్టుబడిగా వెచ్చించనుంది.