News October 9, 2025
సూర్యాపేట: మహిళను బెదిరించిన ఐదుగురు అరెస్టు

పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళను చంపుతామని బెదిరించిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఎర్కారం గ్రామానికి చెందిన సైదమ్మ ఇంటి ముందు ఉండగా, కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు తల్వార్ తిప్పుతూ ఆమెను బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
Similar News
News October 9, 2025
గడువులోపు ఆమోదం తెలపకపోతే చట్టంగా భావిస్తాం: ఏజీ

TG: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తోంది. ఈ బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపినా ఆమోదం తెలపలేదని AG సుదర్శన్ రెడ్డి HCకి గుర్తు చేశారు. దీంతో తమిళనాడు కేసును ఉదాహరణగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ బిల్లు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేశారు. గవర్నర్/రాష్ట్రపతి గడువులోపు బిల్లును ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు.
News October 9, 2025
వరంగల్: తగ్గిన చిరుధాన్యాల ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాలు ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా.. ఈరోజు రూ.2,130 చేరింది. సూక పల్లికాయకు నిన్న రూ.6,610 ధర రాగా.. గురువారం రూ.6,500 వచ్చింది. పచ్చి పల్లికాయకు బుధవారం రూ.4,100 ధర పలకగా.. ఈరోజు రూ.4వేలు అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
News October 9, 2025
వరంగల్: ప్రజలకు సమాచార అస్త్రం ఆర్టీఐ: డీఐఈఓ

ఆర్టీఐ ద్వారా సుపరిపాలన అనే అంశంపై వరంగల్ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం-2005పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించి విద్యార్థులకు బహుమతులను అందించారు. సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు సమాచారాన్ని పొందడంలో అస్త్రంగా ఉపయోగపడుతుందన్నారు.