News October 9, 2025
వరంగల్: రైలు బాత్ రూంలో ప్రయాణికుడి మృతి

కాజీపేట సిద్ధార్థ నగర్ చెందిన మరెల్లి సుజిత్ గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బాత్ రూంలో గుండె పోటుతో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. HYD నుంచి వెళ్తుండగా జనగామ సమీపంలో S2 బోగిలో మరుగుదొడ్డి వెళ్లాడు. మరుగుదొడ్డిలో సుజిత్ పడిపోయి ఉండటంతో తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కాజీపేటలో బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
Similar News
News October 9, 2025
FLASH: జడ్చర్ల: ‘GOVT స్కూల్లో భోజనంలో జెర్రీ’

జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో అక్షయ పాత్ర భోజనంలో ఈరోజు తాడి జెర్రీ వచ్చిందని, విద్యార్థులు అన్నం తినకుండా పడేశారని DYFI MBNR జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం విద్యార్థులు తినేటప్పుడు అన్నంలో పురుగులు రావడంతో ఇబ్బంది పడుతూ తమకు విషయం చెప్పారని తెలిపారు. ప్రతిరోజు ఇలానే పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు.
News October 9, 2025
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్కు కలెక్టర్ స్వాగతం

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.
News October 9, 2025
కోనసీమ దుర్ఘటన.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

AP: కోనసీమ(D) రాయవరంలో బాణసంచా పేలి 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పేలుడుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. విచారణ అధ్యయన నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.