News April 7, 2024
నా కుటుంబసభ్యులందరి ఫోన్లను ట్యాప్ చేశారు: ఈటల
TG: ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితుడిని తానేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తన కుటుంబసభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర చర్చ జరగాలని, మళ్లీ జరగకుండా చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 9, 2024
వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు: మంత్రి అనిత
AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
News October 9, 2024
CM రేవంత్రెడ్డిని కలిసిన BRS MLA మల్లారెడ్డి
TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.
News October 9, 2024
J&K ప్రజలకు కృతజ్ఞతలు: రాహుల్ గాంధీ
జమ్మూకశ్మీర్లో తమ కూటమి సాధించిన గెలుపు రాజ్యాంగ విజయంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. విజయాన్ని అందించిన J&K ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని తెలిపారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని ట్వీట్ చేశారు.