News October 9, 2025
ఇకనైనా ANU ప్రతిష్ట మెరుగుపడుతుందా?

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో పలు కథనాలు ప్రరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.
Similar News
News October 9, 2025
ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం.10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.
News October 9, 2025
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది?

TG: బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై HCలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. GO-9తో పాటు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్పైనా ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఇప్పుడు INC సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముందే నిర్ణయించుకున్నట్లు ‘ప్లాన్-బి’ ప్రకారం పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
News October 9, 2025
CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.