News October 9, 2025
లక్ష్మీదేవి పద్మం పైనే ఎందుకుంటుంది?

లక్ష్మీదేవిని పద్మంపై ఆసీనురాలిగా చూపడం వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. తామరపువ్వు నీటిలో అటూ ఇటూ కదులుతూ, ఊగుతూ ఉంటుంది. ఆ తామర మాదిరిగానే సంపద కూడా చంచలమైనది. అంటే నిలకడ లేనిదని అర్థం. లక్ష్మీదేవి కమలంపై కొలువై ధనం అశాశ్వత స్వభావాన్ని మానవులకు నిరంతరం గుర్తుచేస్తుంది. సంపద శాశ్వతం కాదని, మనిషి గర్వం లేకుండా ఉండాలని ఈ దైవిక రూపం మనకు బోధిస్తుంది. <<-se>>#DHARMASANDEHALU<<>>
Similar News
News October 9, 2025
₹6లక్షల కోట్లతో 10000 KM గ్రీన్ఫీల్డ్ హైవేలు

దేశంలో ₹6 లక్షల కోట్లతో 10వేల KMమేర 25 గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మిస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఈ ప్రాజెక్టుల వల్ల ₹15L కోట్ల ఆదాయం రానుంది. ఎక్స్ప్రెస్ హైవేలతో లాజిస్టిక్స్ కాస్ట్ 16% నుంచి 10%కి వచ్చింది. DECకి 9%కి తగ్గుతుంది’ అని చెప్పారు. దేశ AUTO రంగం ₹22 L కోట్లుగా ఉందని, 5 ఏళ్లలో వరల్డ్ నంబర్1 అవుతుందని తెలిపారు. US ₹78L కోట్లు, చైనా ₹47L కోట్లు కాగా IND 3వ ప్లేస్.
News October 9, 2025
భారతదేశపు తొలి ఫోరెన్సిక్ నిపుణురాలు

సాంప్రదాయ ఆహార్యంలో కనిపించే రుక్మిణీ కృష్ణమూర్తిని చూసి ఎవరూ ఫోరెన్సిక్ నిపుణురాలు అనుకోరు. 1993 ముంబయి పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 ఉగ్రదాడి, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. చెన్నైలో జన్మించిన రుక్మిణీ కృష్ణమూర్తి అనలిటికల్ కెమిస్ట్రీలో PG, PhD చేశారు. మహారాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా చేరి, డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. <<-se>>#firstwomen<<>>
News October 9, 2025
ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం.10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.