News October 9, 2025
నల్గొండ: పండుగ వేళ.. రూ.1.65 కోట్ల ఆదాయం

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీకి భారీ అదనపు ఆదాయం సమకూరింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వారం రోజులపాటు నల్గొండ, నకిరేకల్, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ద్వారా 597 అదనపు బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ 7 డిపోల పరిధిలో పండుగకు ముందు, తరువాత మొత్తం 33,99,804 కిలోమీటర్ల మేర బస్సులను నడపగా, ఆర్టీసీకి ఏకంగా రూ.1,65,78,605 వరకు అదనపు ఆదాయం లభించింది.
Similar News
News October 10, 2025
బిజినెస్ న్యూస్ రౌండప్

* 2025-26 FY రెండో త్రైమాసికంలో రూ.12,075 కోట్ల నికర లాభం ప్రకటించిన TCS. ఒక్కో షేర్పై రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
* LG ఎలక్ట్రానిక్స్ IPO సూపర్ సక్సెస్: 7.13 కోట్ల షేర్లు జారీ చేయగా 385 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు. వీటి విలువ దాదాపు రూ.4.4 లక్షల కోట్లు. ఇవాళ IPO అలాట్మెంట్
* నేడు భేటీ కానున్న టాటా సంస్థల ట్రస్టీలు. కొద్దిరోజులుగా బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలకు తెరదించే అవకాశం
News October 10, 2025
చిత్తూరు జిల్లాలో ఈ దగ్గు మందు వాడుతున్నారా?

‘RespiFresh-TR’ దగ్గు సిరప్లో నిషేధిత DEG సాల్వెంట్ 35%పైగా ఉండటంతో దాన్ని ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు DD నాగ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆ సిరప్ను టెస్ట్ చేసినప్పుడు నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ‘RespiFresh-TR’ సిరప్ మార్కెట్లో ఉందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66, కడప జిల్లాలోని షాపుల్లో 24 బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.
News October 10, 2025
JGTL: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్

మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి భారీ పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడిన ఘటన JGTL జిల్లాలో చోటుచేసుకుంది. కొడిమ్యాల PSలో నమోదైన ఈ కేసులో అదే గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, రాజు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు. అలాగే జగిత్యాలకు చెందిన ఫొటోగ్రాఫర్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించగా, సదరు ఫొటోగ్రాఫర్నూ అరెస్టు చేసినట్లు సమాచారం.