News October 9, 2025
సఖి సురక్ష పథకం ఎందుకంటే?

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఏపీ ప్రభుత్వం సఖి సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 35 ఏళ్లు పైబడిన మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనతతో పాటు గర్భాశయ సమస్యలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. పట్టణ మహిళల ఆరోగ్యస్థితిని పర్యవేక్షించేందుకు డిజిటల్ హెల్త్ రికార్డులు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆరోగ్యపరంగా చైతన్యం పొందుతారని అధికారులు వెల్లడిస్తున్నారు.
Similar News
News October 9, 2025
లిటరేచర్లో హంగేరియన్ రచయితకు నోబెల్ ప్రైజ్

2025కి గాను లిటరేచర్(సాహిత్యం) విభాగంలో హంగేరి రచయిత లాస్లో క్రాస్నాహోర్కాయ్(László Krasznahorkai)ను నోబెల్ ప్రైజ్ వరించింది. బైబిల్లోని ఆఖరి కాండానికి (అపోకలిప్సి) కళను జోడించి చేసిన ఊహాత్మక రచనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పటివరకు రాయల్ స్వీడిష్ అకాడమీ మెడిసిన్, ఫిజిక్స్, <<17948685>>కెమిస్ట్రీ<<>> విభాగాల్లో బహుమతులు ప్రకటించింది. ఇంకా ఎకనామిక్ సైన్స్, పీస్ విభాగాల్లో ప్రైజ్లు ప్రకటించాల్సి ఉంది.
News October 9, 2025
పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: వాకిటి

TG: ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే బీసీల నోటి కాడ ముద్ద లాక్కుంటున్నారని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టు వద్ద మాట్లాడారు. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో వెనక్కి పోయేదేలేదని మంత్రి స్పష్టం చేశారు. BRS, BJP కుమ్మక్కు వల్లే HC స్టే విధించిందని మంత్రి జూపల్లి ఆరోపించారు.
News October 9, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీలు, IT సంస్థలు, ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో నెలకొక పెయిడ్ లీవ్ చొప్పున ఇవ్వాలని వెల్లడించింది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.