News October 9, 2025
ఏలూరు: యువతికి వేధింపులు.. యువకుడి అరెస్టు

ఏలూరు వన్టౌన్లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న యువతిని ప్రేమించాలంటూ వేధిస్తున్న సాయి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో సాయి వెంటపడటంతో, బాధితురాలు శక్తి టీమ్కు ఫిర్యాదు చేసింది. అతడిని పట్టుకున్న శక్తి టీం, వన్టౌన్ పోలీసులకు అప్పగించింది. సాయిపై కేసు నమోదు చేశామని, సహకరించినందుకు యువతి కృతజ్ఞతలు తెలిపిందని సీఐ సుబ్బారావు గురువారం వెల్లడించారు.
Similar News
News October 10, 2025
నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునః ప్రారంభం

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఈఓ మూర్తి తెలిపారు. ఈ నెల 2 నుంచి 9 వరకు ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని పురస్కరించుకుని ఈ 8 రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో వీటిని పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.
News October 10, 2025
భీమవరం: డీడీఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు జీపీఎఫ్, పెన్షన్ కేసుల పరిష్కారానికి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల డీడీఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ శాంతి ప్రియ మాట్లాడుతూ.. అకౌంటింగ్, బిల్స్కు సంబంధించిన విషయాలలో డీడీవోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
News October 9, 2025
గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై జేసీ రాహుల్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్లో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. యాత్రికుల సౌకర్యార్థం 42 పుష్కర ఘాట్లకు సంబంధించిన మరమ్మతులు, అప్రోచ్ రోడ్లు, తాగునీరు, శానిటేషన్, లైటింగ్, టాయిలెట్స్ పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రేపట్లోగా పనుల నివేదిక సమర్పించాలని జేసీ కోరారు.