News October 9, 2025
హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ వర్మ

రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టును హెచ్సీఏ ప్రకటించింది. జట్టు కెప్టెన్గా తిలక్ వర్మకు బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్గా రాహుల్ సింగ్ ఉన్నారు. అయితే, ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్ప్రదేశ్తో హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్ల్లో తలపడనుంది. నగరవాసులు ఎంతగానో అభిమానించే తిలక్ వర్మ హైదరాబాద్ కెప్టెన్గా కావడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 9, 2025
ఓయూ LLM పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని LLM పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. LLM 2, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News October 9, 2025
సైబర్ మోసాలపై HYD సైబర్ క్రైమ్ పోలీసుల సూచన

ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్మెంట్తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. 1930, వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి.
News October 9, 2025
‘మేము రాము భర్కత్పురా PF ఆఫీస్కు’

భర్కత్పురా PF ఆఫీస్లో అర్జీదారుల కష్టాలు వర్ణణాతీతం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు, స్థానికులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, మరోసారి మేము రాము భర్కత్పుర PF ఆఫీస్కు అంటున్నారు. స్లిప్లు, సెక్షన్ మార్పులతో రోజంతా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకేసారి వివరాలు చెప్పే PROని నియమించాలని కోరుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, ఓపిక లేక బయటవచ్చి కూర్చున్నామని చెబుతున్నారు.