News October 9, 2025

ఎన్నికల సిత్రాలు షురూ: ఎర్రగడ్డలో మిర్చి బజ్జీ వేసి!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సిత్రాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో BRS అభ్యర్థి మాగంటి సునీత తన దైన శైలిలో వెళుతున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని బి.శంకర్‌లాల్‌నగర్, సుల్తాన్‌నగర్‌లో కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావుతో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఓ హోటల్ వద్ద మిర్చి బజ్జీలు వేశారు. ఉప ఎన్నిక ప్రచారం ముగింపు వరకు ఇంకెన్ని సిత్రాలు ఉంటాయో చూడాలి.

Similar News

News October 9, 2025

సైబర్ మోసాలపై HYD సైబర్ క్రైమ్ పోలీసుల సూచన

image

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. 1930, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.

News October 9, 2025

‘మేము రాము భర్కత్‌పురా PF ఆఫీస్‌కు’

image

భర్కత్‌పురా PF ఆఫీస్‌లో అర్జీదారుల కష్టాలు వర్ణణాతీతం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు, స్థానికులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, మరోసారి మేము రాము భర్కత్‌పుర PF ఆఫీస్‌కు అంటున్నారు. స్లిప్‌లు, సెక్షన్ మార్పులతో రోజంతా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకేసారి వివరాలు చెప్పే PROని నియమించాలని కోరుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, ఓపిక లేక బయటవచ్చి కూర్చున్నామని చెబుతున్నారు.

News October 9, 2025

పల్స్ పోలియోని విజయవంతం చేయండి: HYD కలెక్టర్

image

నిండు ప్రాణానికి – రెండు చుక్కలని పోలియో రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే పల్స్ పోలియో నిర్వహణ కార్యక్రమంపై జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం భారతదేశంలో, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి 1995లో ప్రారంభించామన్నారు.