News October 9, 2025
JNG: పేరెంట్స్ GREAT.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టారు

రఘునాథపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్(29) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుని అవయవాలు దానం చేసి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణదానం చేశారు.
Similar News
News October 9, 2025
GNT: అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అపరాధ రుసుం

నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.
News October 9, 2025
పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇ-పంటలో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
News October 9, 2025
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి: ప్రిన్సిపల్

పారామెడికల్ కోర్సులకు భూపాలపల్లి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఎంఎల్టీ, డీఈసీజీలో 30 సీట్ల చొప్పున ఈ నెల 28వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రింట్ కాపీని ₹100 రుసుముతో కళాశాలలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.