News October 9, 2025
లాభాలు తెచ్చిన బంతి సాగు.. రైతుల్లో ఆనందం

దసరా, దీపావళి సీజన్లను దృష్టిలో పెట్టుకొని బంతి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలు దక్కడంతో ఆనందంగా ఉన్నారు. తొలుత వర్షాల వల్ల పంటకు కొంత నష్టం వాటిల్లినా.. బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా, శుభకార్యాల వల్ల బంతి పూలకు డిమాండ్ పెరిగి రైతులకు మంచి ఆదాయం వచ్చింది. దసరా సీజన్ ముగిసిన నాటికి ఎకరాకు రూ.2లక్షల వరకూ లాభం వచ్చిందని, దీపావళికి ఇది మరింత పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 9, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: మహేశ్ కుమార్

TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో HCలో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి.
News October 9, 2025
త్రిమూర్తులుగా అవతరించిన నారాయణుడు

సృష్టి ఆరంభంలో నారాయణుడు ఒక్కడే స్వయం ప్రకాశంగా ఉండి.. సత్వ, రజో, తమో గుణాల భేదాల కారణంగా మూడు రూపాలు ధరించాడు. రజో గుణంతో సృష్టికర్తయైన బ్రహ్మగా, తమో గుణంతో లయకారుడైన శివుడిగా, సత్వ గుణంతో పాలకుడైన విష్ణువుగా అవతరించాడు. ఆ విష్ణువే సర్వాతీతుడు కాబట్టి ఆయన్నే మహేశ్వరుడు అని కీర్తించారు. ఈ సృష్టిలోని సర్వ దేవతా శక్తులన్నీ మూలపురుషుడైన నారాయణుడి ఏకత్వంలో నుంచే ఉద్భవించాయి. <<-se>>#WhoIsGod<<>>
News October 9, 2025
డీఎస్సీకి అభ్యర్థులు సన్నద్ధం కావాలి: లోకేశ్

AP: DSC, స్పెషల్ DSCలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. NOV చివరి వారంలో టెట్, 2026 JANలో DSC నోటిఫికేషన్, MARలో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త డీఎస్సీ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలన్నారు.