News October 9, 2025
అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులను వినియోగించుకోవాలి: కలెక్టర్

సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ పరిధిలో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రిన్సిపల్ రామానుజ, టీచర్స్ అందరితో సమావేశం నిర్వహించారు. యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకు వచ్చినట్లు తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 9, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: మహేశ్ కుమార్

TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో HCలో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి.
News October 9, 2025
త్రిమూర్తులుగా అవతరించిన నారాయణుడు

సృష్టి ఆరంభంలో నారాయణుడు ఒక్కడే స్వయం ప్రకాశంగా ఉండి.. సత్వ, రజో, తమో గుణాల భేదాల కారణంగా మూడు రూపాలు ధరించాడు. రజో గుణంతో సృష్టికర్తయైన బ్రహ్మగా, తమో గుణంతో లయకారుడైన శివుడిగా, సత్వ గుణంతో పాలకుడైన విష్ణువుగా అవతరించాడు. ఆ విష్ణువే సర్వాతీతుడు కాబట్టి ఆయన్నే మహేశ్వరుడు అని కీర్తించారు. ఈ సృష్టిలోని సర్వ దేవతా శక్తులన్నీ మూలపురుషుడైన నారాయణుడి ఏకత్వంలో నుంచే ఉద్భవించాయి. <<-se>>#WhoIsGod<<>>
News October 9, 2025
HYD, మేడ్చల్ జిల్లాలో రాత్రి వర్షం కురిసే ఛాన్స్

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో రాత్రి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్ పరిధిలోనూ దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. వాతావరణంలో తేమ శాతం పెరిగిందని, అంతేకాక.. ఉష్ణోగ్రతలు సైతం పెరగటం ఇందుకు సూచికగా వివరించింది.