News October 9, 2025

నర్సీపట్నం కాదు.. హైకోర్టుకు వెళ్లండి: TDP

image

AP: మాజీ CM జగన్‌ నర్సీపట్నం పర్యటనపై TDP సెటైర్లు వేసింది. నర్సీపట్నం కాకుండా హైకోర్టుకు వెళ్లి లాజిక్కులు చెప్పాలని సూచించింది. PPP మోడల్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘PPP మోడల్‌లో వైద్య కళాశాలలు నిర్మించే అంశంలో జోక్యం చేసుకోలేం. అలా నిర్మిస్తే తప్పేంటి? ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మంచిదే కదా’ అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వార్తను ట్వీట్ చేసింది.

Similar News

News October 9, 2025

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: మహేశ్ కుమార్

image

TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో HCలో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్‌ జరగనున్నాయి.

News October 9, 2025

త్రిమూర్తులుగా అవతరించిన నారాయణుడు

image

సృష్టి ఆరంభంలో నారాయణుడు ఒక్కడే స్వయం ప్రకాశంగా ఉండి.. సత్వ, రజో, తమో గుణాల భేదాల కారణంగా మూడు రూపాలు ధరించాడు. రజో గుణంతో సృష్టికర్తయైన బ్రహ్మగా, తమో గుణంతో లయకారుడైన శివుడిగా, సత్వ గుణంతో పాలకుడైన విష్ణువుగా అవతరించాడు. ఆ విష్ణువే సర్వాతీతుడు కాబట్టి ఆయన్నే మహేశ్వరుడు అని కీర్తించారు. ఈ సృష్టిలోని సర్వ దేవతా శక్తులన్నీ మూలపురుషుడైన నారాయణుడి ఏకత్వంలో నుంచే ఉద్భవించాయి. <<-se>>#WhoIsGod<<>>

News October 9, 2025

డీఎస్సీకి అభ్యర్థులు సన్నద్ధం కావాలి: లోకేశ్

image

AP: DSC, స్పెషల్ DSCలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. NOV చివరి వారంలో టెట్, 2026 JANలో DSC నోటిఫికేషన్, MARలో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త డీఎస్సీ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలన్నారు.