News October 9, 2025

సిద్దిపేట: ‘బాండ్ పేపర్ పై సంతకం చేసి పోటీ చేయాలి’

image

సిద్దిపేట జిల్లా నంగునూర్ మంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు బాండ్ పేపర్ పై సంతకం చేయాలని యువత నిర్ణయం తీసుకుంది. రూ.100 బాండ్ పేపర్ పై ‘అక్రమ ఆస్తులు సంపాదించనని, ఐదేళ్ల తర్వాత ఆస్తులు పెరిగితే గ్రామానికి అప్పగిస్తామని, జీపీ పనుల కోసం ప్రజల దగ్గర డబ్బులు అడగనని, తప్పుడు లెక్కలు చూపనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తాను’ అని రాసి బాండ్‌లో పేర్కొన్నారు.

Similar News

News October 10, 2025

తిరుపతి గరుడ వారధిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద గరుడ వారధిపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ సేఫ్టీ వాల్‌ను బలంగా ఢీకొట్టి కింద పడిపోయారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2025

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపును శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దివ్యాంగుల పెన్షన్ కోసం రీ అసెస్మెంట్‌లో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు సదరం క్యాంప్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడి సేవలందించాలని కలెక్టర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News October 10, 2025

HYD: యువతి సూసైడ్.. ఈ యువకుడిపై అనుమానం

image

లాలాపేట PS పరిధి రైల్వే డిగ్రీ కాలేజీ విద్యార్థి మౌనిక(20) సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. MKనగర్‌లో నివాసం ఉండే అంబాజీ(వాలీబాల్ కోచ్) మీద మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మీద నమ్మకం ఉందని, నిజాలు తేల్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వాలీబాల్ కోచ్‌ వేధింపులే ఆమె సూసైడ్‌కు కారణమని మౌనిక స్నేహితులు చెప్పారు. కోచ్‌కు కాలేజీకి సంబంధం లేదని అక్కడి సిబ్బంది స్పష్టం చేశారు.