News October 9, 2025
నరసరావుపేట: ’22A’ భూములపై కలెక్టర్ సమీక్ష

పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా గురువారం కలెక్టర్ కార్యాలయంలో సెక్షన్ 22A కింద ఉన్న భూములపై సమీక్ష నిర్వహించారు. భూముల కేటాయింపు, హక్కుల గుర్తింపు, పత్రాల పరిశీలన, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలపై కలెక్టర్ చర్చించారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ అధికారులు బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 10, 2025
TODAY HEADLINES

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్పై సౌతాఫ్రికా విజయం
News October 10, 2025
IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.
News October 10, 2025
పటాన్చెరు LIGలో పేలుడు

పటాన్చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.