News October 9, 2025
బాణాసంచా విక్రయాలకు పర్మిషన్ తీసుకోవాలి: కలెక్టర్

దీపావళి పండగకు బాణాసంచా విక్రయించే షాపుల అనుమతులకు అక్టోబర్ 17 లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 20న దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకొనుటకు ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 10, 2025
‘శక్తి’ కాల్స్పై సత్వరమే స్పందించాలి: SP

GNT SP వకుల్ జిందాల్ గురువారం SP కార్యాలయంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో నైపుణ్యం కలిగి, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే సిబ్బందిని అందుబాటులో ఉంచాలని SP సూచించారు. PGRS ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా, శక్తి కాల్స్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సత్వరమే స్పందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
News October 9, 2025
GNT: అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అపరాధ రుసుం

నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.
News October 9, 2025
పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇ-పంటలో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.