News October 9, 2025
యాదాద్రి: మొదటి విడత ఎన్నికలు ఇక్కడే..

భువనగిరి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఆలేరు, రాజపేట, మోటకొండూరు, యాదగిరిగుట్ట, తుర్క పల్లి(ఎం), బొమ్మలరామారం, గుండాల, ఆత్మకురు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఈ ప్రక్రియ ఎంపీడీవో కార్యాలయాలలో కొనసాగుతుందన్నారు.
Similar News
News October 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 10, 2025
పాలమూరు: కోర్టు స్టే.. కాంగ్రెస్ MLA కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇందుకు సంబంధించి పార్టీపరమైన స్పష్టత రెండు రోజుల్లో రాబోతోందని కాంగ్రెస్ నేత, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
News October 10, 2025
దేశంలో బురఖా బ్యాన్కు ప్లాన్ చేస్తున్న మెలోని!

ఇటలీలో ఇస్లామిక్ తీవ్రవాదం, వేర్పాటువాదం కట్టడికి ఆ దేశ PM మెలోని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా, హిజాబ్, నిఖాబ్ ధరించడం, మసీదులకు ఫండింగ్ను బ్యాన్ చేయనున్నట్లు సమాచారం. రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం తెలిసిందే.